తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-29T03:04:00+05:30 IST

తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని సమైక్యవాదులను టీపీసీసీ

తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని సమైక్యవాదులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో ట్వీట్‌ చేసారు. సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేసారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్రఅని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేసారు. 




Updated Date - 2021-10-29T03:04:00+05:30 IST