317 జీవో కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహం: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-10T03:05:53+05:30 IST

కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని ..

317 జీవో కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వమని, దానికి తాజా ఉదంతం బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకోవడమేనన్నారు. అడ్డగోలు బదిలీతో మనస్థాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగో… బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారన్నారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉందని చెప్పారు. ఈ చావులకు ప్రభుత్వమే కాదు… వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగసంఘాలు కూడా బాధ్యులేనని తెలిపారు. 317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై పోరాడుదామని, ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు

Updated Date - 2022-01-10T03:05:53+05:30 IST