అంబానీ, అదానీలకోసమే కొత్త చట్టాలు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-06T02:17:53+05:30 IST

ఢిల్లీలో అన్నదాతల పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఎన్నికలపై ..

అంబానీ, అదానీలకోసమే కొత్త చట్టాలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఢిల్లీలో అన్నదాతల పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆయన విమర్శించారు. మోదీ తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు అవుతున్నాయని మండిపడ్డారు. అంబానీ, అదానీల కోసమే మోదీ కొత్త చట్టాలు తెచ్చారని విమర్శించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 6,380 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కౌలు రైతులు.. రైతులే కాదని కేసీఆర్ తేల్చిపారేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Updated Date - 2020-12-06T02:17:53+05:30 IST