రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలి: రేవంత్
ABN , First Publish Date - 2022-04-23T22:49:28+05:30 IST
రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్: రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 6, 7 తేదీల్లో రాహుల్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్షిప్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వరంగల్లో బహిరంగ సభలు పెట్టి టీఆర్ఎస్ బలంగానే ఉందంటూ.. ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్దని ఎద్దేవాచేశారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని రేవంత్రెడ్డి తెలిపారు.