దోపిడీ ఉన్నచోట తిరుగుబాటు ఉంటుంది: Revanth Reddy

ABN , First Publish Date - 2022-05-21T23:13:18+05:30 IST

దోపిడీ ఉన్నచోట తిరుగుబాటు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు.

దోపిడీ ఉన్నచోట తిరుగుబాటు ఉంటుంది: Revanth Reddy

అక్కంపేట: దోపిడీ ఉన్నచోట తిరుగుబాటు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘రైతు రచ్చబండ’ కార్యక్రమం ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సొంతూరు అక్కంపేట రచ్చబండ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ  సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తమ కార్యకర్తల జోలికొస్తే ప్రగతిభవన్ గడి గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సొంతూరు అక్కంపేట నిరాధారణకు గురైందని తెలిపారు. అక్కంపేటలో ప్రొ.జయశంకర్ విగ్రహం పెట్టలేదని తప్పుబట్టారు. మాజీమంత్రి కొండా సురేఖ దంపతులే  ప్రొ.జయశంకర్ విగ్రహం పెట్టారని తెలిపారు. అక్కంపేటను దత్తత తీసుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వస్తే రాహుల్‌ను అక్కంపేటకు తీసుకొస్తానని తెలిపారు. హామీలు అమలు చేయని సీఎం కేసీఆర్‌ (CM KCR) ను నిలదీయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-21T23:13:18+05:30 IST