అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-17T21:09:47+05:30 IST

ఎమ్మెల్సీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం అధికారుల వైఫల్యమన్నారు.

అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్సీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం అధికారుల వైఫల్యమన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పొందుపర్చలేదన్న తమ నమ్మకం బలపడిందన్నారు. మాజీ కలెక్టర్‌ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వెంకటరామిరెడ్డి రాజీనామాను తిరస్కరించాలని ఫిర్యాదు చేశామని రేవంత్ పేర్కొన్నారు. వెంకట్‌రామిరెడ్డి నామినేషన్‌ ఆమోదిస్తే కోర్టు, కేంద్రం ముందు నిలబెడతామన్నారు. 

Updated Date - 2021-11-17T21:09:47+05:30 IST