జైపాల్ రెడ్డి లేకున్నా.. ఆయన సాధించిన తెలంగాణలో ఉన్నాం: రేవంత్

ABN , First Publish Date - 2022-01-16T17:49:39+05:30 IST

నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..

జైపాల్ రెడ్డి లేకున్నా.. ఆయన సాధించిన తెలంగాణలో ఉన్నాం: రేవంత్

హైదరాబాద్: నెక్లెస్ రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడిన వ్యక్తుల్లో జైపాల్ రెడ్డి ఒకరన్నారు. దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జై పాల్ రెడ్డి తీసుకున్నారని రేవంత్ తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జై పాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయన్నారు. రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్ళు, కాంట్రాక్ట్‌లుగా కేసీఆర్ చేశారన్నారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని.. పీవీ, మర్రి చెన్నా రెడ్డి సరసన నిలిచే నాయకుడు జైపాల్ రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-16T17:49:39+05:30 IST