రైతుల కోసం వరంగల్‌లో డిక్లరేషన్ ప్రకటించాం: Revanth reddy

ABN , First Publish Date - 2022-05-08T20:25:43+05:30 IST

రాహుల్ గాంధీ సభను సక్సస్ చేసిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

రైతుల కోసం వరంగల్‌లో డిక్లరేషన్ ప్రకటించాం: Revanth reddy

Hyderabad: రాహుల్ గాంధీ సభను సక్సస్ చేసిన తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం వరంగల్ సభలో డిక్లరేషన్ ప్రకటించామన్నారు. లక్షలాది మంది రైతులు వచ్చి ఆశీర్వదించారన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ దెబ్బకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కలుగులో నుంచి బయటకు వచ్చారని, తమపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్‌ను రైతులు ఆమోదం పొందడం తమకు ప్రోత్సాహం, ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు.


మంత్రి కేటీఆర్‌కు ఆయన తండ్రి కేసీఆర్ చరిత్ర తెలుసో తెలియదోనని రేవంత్ అన్నారు. సింగిల్ విండో డైరెక్టర్‌గా ఓడిపోయిన కేసీఆర్‌ను చైర్మన్‌ను చేసింది కాంగ్రెస్ అని, కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితో మొదలైందన్న విషయం కేటీఆర్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. సింగిల్ విండో డైరెక్టర్‌గా, ఎమ్మేల్యేగా కేసీఆర్ ఓడిపోయారన్నారు. ఓటమి భయంతో ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్లి పోటీ చేసిన చరిత్ర కేసీఆర్‌దని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more