ఫోటోలకు ఫోజులు తప్ప.. చేసిందేమీ లేదు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-06T20:47:06+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

ఫోటోలకు ఫోజులు తప్ప.. చేసిందేమీ లేదు: రేవంత్‌రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. ఫోటోలకు ఫోజులు తప్ప.. టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతానన్న కేసీఆర్.. ఫాంహౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. 

Updated Date - 2021-12-06T20:47:06+05:30 IST