కేసీఆర్, పీకే భేటీపై స్పందించిన రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-25T21:59:57+05:30 IST
కేసీఆర్, పీకే భేటీపై స్పందించిన రేవంత్రెడ్డి
హైదరాబాద్: సీఎం కేసీఆర్, పీకే భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్తో తెగదెంపుల కోసమే కేసీఆర్ను ప్రశాంత్ కలిశారని చెప్పారు. ప్రశాంత్ కిశోర్కు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరాక రాష్ట్రానికి వస్తారని ఆయన చెప్పారు. తనతో కలిసి పీకే ప్రెస్మీట్ పెట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని పీకే చెప్పడం మీరు వింటారని స్పష్టం చేశారు. పీకే కాంగ్రెస్లో చేరిన తర్వాత అధిష్టానం మాటే ఫైనల్ అవుతుందన్నారు.