సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2022-07-12T23:55:00+05:30 IST
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారంపై రేవంత్ లేఖ రాశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారంపై రేవంత్ లేఖ రాశారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయించాలన్నారు. అలాగే ఎకరాకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి, పంట బీమా అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.