నెలరోజుల పాటు వాయిదా వేయాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-09T02:45:04+05:30 IST

నెలరోజుల పాటు వాయిదా వేయాలి: రేవంత్‌రెడ్డి

నెలరోజుల పాటు వాయిదా వేయాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియను నెలరోజుల పాటు వాయిదా వేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఏప్రిల్ 8 వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ సమర్పించిన హార్డ్ డిస్క్, సీడీల్లోని సమాచారం ల్యాప్‌టాప్‌లో తెరుచుకోవడం లేదని రేవంత్ తరపు న్యాయవాది కోర్టును తెలిపారు. ఆ సమాచారాన్ని తాము అందిస్తామని ఏసీబీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. నెలరోజులపాటు విచారణను వాయిదా వేయాలన్ని రేవంత్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని ఏసీబీ తరపు ప్రత్యేక పీపీ తెలిపారు. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

 

Updated Date - 2021-03-09T02:45:04+05:30 IST