ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2022-07-02T21:37:35+05:30 IST
ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ప్రధాని మోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకై టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు.. కేంద్రం చేసిన హత్యలేనన్నారు. చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను బీజేపీ పక్కన పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన సమయంలో హోర్డింగ్ల పంచాయితీ పెట్టారని వ్యాఖ్యానించారు.