గద్దర్ను కలిసిన రేవంత్..
ABN , First Publish Date - 2020-11-25T16:04:47+05:30 IST
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ను ఎంపీ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు..
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ను ఎంపీ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మొదట గద్దర్ని కలిశానని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు గేటర్ ఎన్నికలలో మేయర్ను తమకు ఇవ్వాలని లేదంటే.. ప్రతిపక్షంగానైనా పాతిక ముప్పై సీట్లు ఇవ్వాలని గ్రేటర్ ప్రజల్ని కోరారు. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటే సమస్యలపైన పోరాడి.. పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నానని.. తనకు తోడుగా 20-30 మంది కార్పొరేటర్లనిస్తే సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ తెలిపారు.