ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తుంటే.. రైతులపై కక్ష సాధింపా?: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-04-02T19:03:03+05:30 IST

కడప: కరోనా టెన్షన్‌లో కడప జిల్లా ప్రజలు ఉన్నారు. ఢిల్లీ మర్కజ్ సభ.. కడపను వణికిస్తోంది. జీరోలో ఉన్న కడపలో ఒక్కరోజులోనే 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తుంటే.. రైతులపై కక్ష సాధింపా?: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తుంటే.. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కొండపోచమ్మ ప్రాంతంలో బహిలింపుర్, మామిడ్యాల, తనేదార్‌పల్లి గ్రామాల్లో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు. ఉన్నపళంగా  ఇండ్లను కూల్చి రైతుల బతుకులు బజారుపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులపై ఇంత కక్ష సాధింపా? అని రేవంత్ మండిపడ్డారు.


Updated Date - 2020-04-02T19:03:03+05:30 IST