TS News: ఎంగిలి మెతుకుల కోసం విశ్వాస ఘాతుకం: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2022-08-03T03:02:36+05:30 IST
Hyderabad: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) రేవంత్ రెడ్డి(Revanth
Hyderabad: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Komati Reddy Raja Gopal Reddy) కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాజగోపాల్రెడ్డినుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ ప్రజలకు బీజేపీ (BJP) అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. లోక్సభ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ అవహేళన చేశారు. కాంట్రాక్టుల కోసమే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. మోదీ, అమిత్షా ఇచ్చిన కాంట్రాక్టుల కోసం కొందరు పనిచేస్తున్నారు. ఈడీ బీజేపీకి ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది. ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ను వేధిస్తున్నారు. సోనియా కోసం పోరాడాల్సిన సమయంలో..అమిత్షా దగ్గర కూర్చొని కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. ఎంగిలి మెతుకుల కోసం విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు’ అని రేవంత్ విమర్శించారు.