కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దింది: రేవంత్

ABN , First Publish Date - 2022-01-26T17:11:02+05:30 IST

కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దింది: రేవంత్

హైదరాబాద్ : కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు కాలరాస్తోందరన్నారు. పార్లమెంట్‌లో చర్చలకు తావులేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారన్నారు. మోదీ రాజ్యంలో మోదీ చక్రవర్తి అయితే కేసీఆర్ సామంత రాజు అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి వాపోయారు.

Updated Date - 2022-01-26T17:11:02+05:30 IST