అప్పుడే విత్‌డ్రా చేసిన రూ.49 వేలు.. బ్యాంకు గేటు దాటకముందే బ్యాగ్‌లోంచి మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2022-07-15T17:26:48+05:30 IST

ఆయన ఒక రిటైర్డ్ సోల్జర్. దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. సుమారు రూ.49 వేలు విత్‌డ్రా చేశాడు. వాటిని తనతోపాటు తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకున్నాడు. కట్ చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే అతడి బ్యాగ్‌లోంచి డబ్బు మాయం అయింది. బ్యాంకు గేటు దాటక

అప్పుడే విత్‌డ్రా చేసిన రూ.49 వేలు.. బ్యాంకు గేటు దాటకముందే బ్యాగ్‌లోంచి మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక రిటైర్డ్ సోల్జర్. దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. సుమారు రూ.49 వేలు విత్‌డ్రా చేశాడు. వాటిని తనతోపాటు తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకున్నాడు. కట్ చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే అతడి బ్యాగ్‌లోంచి డబ్బు మాయం అయింది. బ్యాంకు గేటు దాటకముందే బ్యాగు ఖాళీగా ఉందని గ్రహించి.. అతడు షాకయ్యాడు. సీసీ కెమెరాలు చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. కాగా.. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... 



రాజస్థాన్‌లోని షాపురా‌కు చెందిన భవానీ సింగ్ కొన్ని సంవత్సరాలపాటు సైనికుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. తాజాగా తన కూతురికి వివాహం కూడా చేసి అత్తారింటికి పంపించారు. ఈ క్రమంలోనే ఆయన కూతురు.. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులతో సరదాగా గడిపి.. అత్తారింటికి తిరుగు పయనం అయింది. అయితే.. కూతురిని ఖాళీ చేతులతో పంపడం ఇష్టం లేని.. భవానీ సింగ్.. డబ్బులు విత్‌డ్రా చేయడానికి స్థానికంగా ఉన్న ఎస్పీఐ బ్యాంకుకు వెళ్లారు. తన గారాల పట్టికి కొన్ని డబ్బులు ఇచ్చి.. మరికొంత మొత్తాన్ని ఇంటి ఖర్చులకు వాడుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు రూ.49వేలు విత్‌డ్రా చేశారు. ఆ మొత్తాన్ని తన వెంట తెచ్చుకున్న బ్యాగులో పెట్టుకుని.. డబ్బుతో కూడిన ఆ బ్యాగును బ్యాంకులోనే కుర్చీపై పెట్టి ఓ చిన్న పని మీద కొంచెం పక్కకు వెళ్లారు. అనంతరం బ్యాగు వద్దకు తిరిగొచ్చి.. అందులో డబ్బులు లేవని గుర్తించి షాకయ్యారు. బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి.. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ కుర్రాడు డబ్బులను కాజేసినట్టు గుర్తించి విస్తుపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భవానీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-07-15T17:26:48+05:30 IST