సజ్జనార్‌ను కలిసిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

ABN , First Publish Date - 2021-11-29T04:42:50+05:30 IST

మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఆ సంస్థ మేనేజిండ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

సజ్జనార్‌ను కలిసిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు
ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్‌కు వినతిపత్రం ఇస్తున్న విశ్రాంత ఉద్యోగులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 28 : మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఆ సంస్థ మేనేజిండ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో, ఇంటర్‌ స్టేట్‌ సర్వీస్‌ లో కూడా సూపర్‌ లగ్జరీ వరకు ఉచిత ప్రయాణం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. అందుకు ఆయన అంగీకారం తెలుపుతూ పీ.ఏ.ను వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ సిద్ధం చేసి తన వద్దకు పంపించాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. విశ్రాంత ఉద్యోగు లు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. యం.డి.ని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహమాన్‌ సోఫి, ప్రధాన కార్యదర్శి కోటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T04:42:50+05:30 IST