మాజీ పోలీసు మద్యం తాగి కుమారుడిపై కాల్పులు

ABN , First Publish Date - 2020-08-27T13:51:46+05:30 IST

ఓ మాజీ పోలీసు ఇన్‌స్పెక్టరు పీకల దాకా మద్యం తాగి కుమారుడితో గొడవపడి అతనిపై కాల్పులు జరిపి, తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన....

మాజీ పోలీసు మద్యం తాగి కుమారుడిపై కాల్పులు

గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్): ఓ మాజీ పోలీసు ఇన్‌స్పెక్టరు పీకల దాకా మద్యం తాగి కుమారుడితో గొడవపడి అతనిపై కాల్పులు జరిపి, తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా నగరంలో జరిగింది. ఎస్కార్టు కాలనీకి చెందిన మాజీ పోలీసు ఇన్ స్పెక్టరు మద్యం తాగాడు. ఆపై తన కుమారుడితో గొడవ పడ్డాడు. కుమారుడిపై కోపంతో తన లైసెన్సుడ్ రివాల్వరుతో కాల్పులు జరిపాడు.


 ఈ కాల్పుల్లో కుమారుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మాజీ పోలీసు అధికారి తాను తుపాకీతో కాల్పుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీసీపీ విశాల్ పాండే చెప్పారు. 

Updated Date - 2020-08-27T13:51:46+05:30 IST