1నుంచి మున్సిపాలిటీల్లో ఇంటింటికీ రేషన్
ABN , First Publish Date - 2021-02-28T06:18:16+05:30 IST
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్చి నెల కోటా నిత్యావసర వస్తువుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఎస్వో టి.శివరామప్రసాద్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 27: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్చి నెల కోటా నిత్యావసర వస్తువుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఎస్వో టి.శివరామప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 126వాహనాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీ జరుగుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 23మంది వాహనదారులు రాజీనామా చేయగా రేషన్ పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా కొత్తవారిని నియమించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 20నుంచి సరుకుల పంపిణీ ప్రారంభమైన దృష్ట్యా మార్చి నెల కోటా అందజేతపై ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు.