యాప్పై పునరాలోచించాలి
ABN , First Publish Date - 2022-08-16T05:22:19+05:30 IST
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెడుతున్న సిమ్స్ ఏపీ యాప్ పై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
బద్వేలు రూరల్, ఆగస్టు 15 : నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెడుతున్న సిమ్స్ ఏపీ యాప్ పై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు తమ సొంత సెల్ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని 9 గంటలకే ముఖ ఆధారితి హాజరు వేయాలనడం ఎంత వరకు సబబు అన్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగా లేక సెల్ఫోన్ పని చేయక హాజరు పడకపోతే సెలవుగా పరిగనించడం సరైన విధానం కాదని ప్రభుత్వానికి తెలిపారు.