అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలి

ABN , First Publish Date - 2020-07-12T09:53:34+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు జరపడానికి ఒకవైపు ఏర్పాట్లుచేస్తోందని, ఈలోగా అక్రమ బదిలీలు జరుగుతున్నాయని యూటీఎఫ్‌

అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలి

ఉపాధ్యాయ సంఘాల నాయకుల డిమాండ్‌


గుంటూరు(విద్య), జూలై 11: రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు జరపడానికి ఒకవైపు ఏర్పాట్లుచేస్తోందని, ఈలోగా అక్రమ బదిలీలు జరుగుతున్నాయని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు, ఏపీటీఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు కె. బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌బాషా వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. అనేకమంది ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సు లేఖల్ని తీసుకుని బదిలీలు పొందుతున్నారని, 10 శాతం హెచ్‌ఆర్‌ఏ, 14శాతం హెచ్‌ఆర్‌ఏ పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అక్రమ బదిలీలను నిలపుదల చేయాలని కోరారు. బదిలీలు నిలిపివేయకుంటే ఈనెల 13న డీఈవో కార్యాలయం వద్ద ఽధర్నా చేస్తామని హెచ్చరించారు.  

Updated Date - 2020-07-12T09:53:34+05:30 IST