అక్టోబరు 10 నాటికి ఫలితాలు: సీబీఎస్ఈ
ABN , First Publish Date - 2020-09-25T08:21:31+05:30 IST
కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులకు ఊరట కలిగిస్తూ సీబీఎ్సఈ, యూజీసీ నిర్ణయం తీసుకున్నాయి...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులకు ఊరట కలిగిస్తూ సీబీఎ్సఈ, యూజీసీ నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబరు 10 నాటికి 12వ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామ ని సీబీఎ్సఈ సుప్రీం కోర్టుకు తెలిపింది. అదేవిధంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను అక్టోబరు 31 వరకు కొనసాగిస్తామని యూజీసీ స్పష్టం చేసింది. ఫలితాలు త్వరగా ప్రకటించేలా సీబీఎ్సఈని ఆదేశించాలని కోరు తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది.