కేయూ ఎంకామ్, ఎంబీఏ పరీక్షల ఫలితాల వెల్లడి
ABN , First Publish Date - 2021-05-08T05:49:56+05:30 IST
కేయూ ఎంకామ్, ఎంబీఏ పరీక్షల ఫలితాల వెల్లడి
కేయూ క్యాంపస్, మే 7: కాకతీయ యూనివర్సిటీ 3వ సెమిస్టర్ ఎంకామ్, ఎంబీఏ ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.మహేందర్రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎం.సురేఖలు శుక్రవారం తెలిపారు. గత డిసెంబరు, మార్చిలో పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. ఫలితాలను కేయూ వెబ్సైట్ ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽలో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.