పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌

ABN , First Publish Date - 2022-04-15T20:09:15+05:30 IST

పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌

పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలి: లోకేష్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుందని విమర్శించారు. జగన్ మోసపు రెడ్డి అమ్మఒడి పథకం తీరు అని, తేదీల మతలాబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్దఒడిగా అమ్మఒడి పథకం మారిందని లోకేష్‌ అన్నారు. ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని మండిపడ్డారు. పథకంపై ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-15T20:09:15+05:30 IST