ఎన్సీఎస్ షుగర్స్ వద్ద ఆంక్షలు
ABN , First Publish Date - 2022-01-20T04:51:10+05:30 IST
చెరకు రైతుల బకాయిల కోసం రైతు సంఘాల ప్రతినిధులు గురువారం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ముందు ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారని, సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు తెలిపారు.
సెక్షన 30, 144 అమలు
డీఎస్పీ మోహనరావు
బొబ్బిలి రూరల్ జనవరి 19: చెరకు రైతుల బకాయిల కోసం రైతు సంఘాల ప్రతినిధులు గురువారం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ముందు ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారని, సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతానగరం తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నెలాఖరు వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ముట్టడి వంటి ఆందోళనల్లో రైతులెవరూ పాల్గొనరాదని చెప్పారు. గత నవంబరులో జరిగిన ఆందోళనలో వందమంది రైతులపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చట్టవిరుద్ధంగా నిర్వహించే ఎటువంటి ఆందోళనలోనైనా పాల్గొంటే మళ్లీ కేసులు పెడతామని డీఎస్పి హెచ్చరించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు సంబంఽధించి అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. భూముల వేలం వాయిదా పడినప్పటికీ త్వరలోనే మళ్లీ నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే వేలం వేసిన పంచదార బస్తాలకు సంబంధించి కోర్టు కేసు నడుస్తోందని, దీనిపై ఈ నెల 21 న హైకోర్టు తీర్పు వస్తుందన్నారు. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన వెంటనే రైతుల బకాయిల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. రైతులంతా సంయమనం పాటించి పోలీసుశాఖకు సహకరించాలన్నారు. కొవిద్ నిబంధనల దృష్ట్యా రాత్రివేళ కర్ఫ్యూ అమలులో ఉందన్నారు.