కరీంనగర్: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు

ABN , First Publish Date - 2020-03-29T13:45:35+05:30 IST

నగరంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు.

కరీంనగర్: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు

కరీంనగర్: నగరంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ అధికారులు డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితి సమీక్షిస్తున్నారు. 


కాగా కరీంనగర్ నగరంలోని పలు చోట్ల ఉన్న మార్కెట్‌లలో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంతో మంత్రి గంగుల కమలాకర్ పలు చర్యలు తీసుకున్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ఉన్న మార్కెట్ వద్ద జనం గుంపులు గుంపులుగా పోగవుతున్నారని.. ఆ మార్కెట్‌ను మూసివేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా కరీంనగర్ బస్టాండ్‌ను మార్కెట్‌గా మార్చి, సామాజిక దూరం పట్టించేలా రైతులకు, ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మార్కింగ్ గీశారు. 

Updated Date - 2020-03-29T13:45:35+05:30 IST