రైళ్లలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరించాలి: సీపీఐ
ABN , First Publish Date - 2022-05-24T09:12:35+05:30 IST
రైళ్లలో వృద్ధులకు టికెట్ ధరలో ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కోరారు.
న్యూఢిల్లీ, మే 23: రైళ్లలో వృద్ధులకు టికెట్ ధరలో ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కోరారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో వృద్ధులకు రాయితీని తొలగించారని, దాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.