రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు తెరుస్తాం: గోవా సీఎం

ABN , First Publish Date - 2020-06-06T02:12:11+05:30 IST

ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తెరుస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు...

రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు తెరుస్తాం: గోవా సీఎం

పనాజీ: ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తెరుస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. సామాజిక దూరం నిబంధనలతో ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా గోవాలో కొవిడ్-19 చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇవాళ 139కి చేరింది. గోవాలోని తొలి కంటైన్మెంట్ ప్రాంతమైన మంగోర్ హిల్‌లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. వాస్కోలోని మంగోర్ హిల్ ప్రాంతంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయనీ... కానీ ఇక్కడ సామాజిక వ్యాప్తి స్థాయిలో కరోనా వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-06T02:12:11+05:30 IST