రోహిత్‌, విరాట్‌, రాహుల్‌కు రెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-15T09:48:14+05:30 IST

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు సీనియర్‌ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సకు విశ్రాంతి ఇవ్వనున్నారు.

రోహిత్‌, విరాట్‌, రాహుల్‌కు రెస్ట్‌

కెప్టెన్సీ రేసులో ధవన్‌, హార్దిక్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌

న్యూఢిల్లీ: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు సీనియర్‌ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అలాగే విరాట్‌ కోహ్లీ, బుమ్రా, రిషభ్‌ పంత్‌ తదిరులు కూడా ఆ సిరీ్‌సలో పాల్గొనడంలేదు. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఓపెనర్‌ ధవన్‌, ఈసారి ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను సమర్థంగా నడిపిస్తున్న హార్దిక్‌ పాండ్యాలలో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ వచ్చేనెల 9న మొదలవనుంది. ఇక ఆ సిరీ్‌సకు  జట్టును ఈనెల 22న ఎంపిక చేస్తారు. 

Updated Date - 2022-05-15T09:48:14+05:30 IST