జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలపై స్పందించాలి
ABN , First Publish Date - 2020-08-04T10:31:06+05:30 IST
జర్నలిస్టుల ఆరోగ్య సమస్య లపై తక్షణమే స్పందించి సహాయం అందేలా చూడాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ కుమార్ ..
కలెక్టరేట్, ఆగస్టు 3 : జర్నలిస్టుల ఆరోగ్య సమస్య లపై తక్షణమే స్పందించి సహాయం అందేలా చూడాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ కుమార్ ఆదేశించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. జర్నలిస్టులుగాని, వారి కుటుంబ సభ్యులు కాని కరోనా బారినపడితే వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నుంచి సహాయ సంచాలకుడు రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.