పూర్తి ఆధారాలతో స్పందిస్తా: జీవితా రాజశేఖర్
ABN , First Publish Date - 2022-04-22T23:22:40+05:30 IST
నటి జీవితా రాజశేఖర్కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: నటి జీవితా రాజశేఖర్కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్పై జ్యోస్టర్ ఎండీ హేమ ఆరోపించారు. ఈ ఆరోపణలను జీవితా రాజశేఖర్ ఖండించారు. ‘‘మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తా. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దు అని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని జీవితా రాజశేఖర్ మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు.