కోర్టు తీర్పులను గౌరవిస్తాం: కన్నబాబు
ABN , First Publish Date - 2021-01-21T21:26:33+05:30 IST
కోర్టు తీర్పులను గౌరవిస్తామని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక
విశాఖ: కోర్టు తీర్పులను గౌరవిస్తామని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మొండిగా ముందుకెళ్తున్నారని తప్పుబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? అని ప్రశ్నించారు. సంతబొమ్మలిలో నంది విగ్రహం తొలగించామని బాబు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేశామని రాద్ధాంతం చేశారని, కళా వెంకట్రావుకు నోటీస్ ఇచ్చి, విచారించి పంపేశారని కన్నబాబు తెలిపారు.