‘అమ్మనబోలు’ను మండలం చేయాలని తీర్మానం

ABN , First Publish Date - 2022-08-07T06:23:01+05:30 IST

అమ్మనబోలును మం డలంగా ఏర్పాటు చేయా లని నార్కట్‌పల్లి మండల సభ తీర్మానించింది.

‘అమ్మనబోలు’ను మండలం చేయాలని తీర్మానం
మండల సమావేశంలో ఫ్లకార్డులతో సభ్యుల నిరసన

సభలో ప్లకార్డులు ప్రదర్శించి బైఠాయించిన సర్పంచులు, ఎంపీటీసీలు

నార్కట్‌పల్లి, ఆగస్టు 6: అమ్మనబోలును మం డలంగా ఏర్పాటు చేయా లని నార్కట్‌పల్లి మండల సభ తీర్మానించింది. ఎం పీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నార్కట్‌పల్లి మండల స ర్వసభ్య సమావేశం జరిగింది.  సభలో మండలంలోని అమ్మనబోలు, నక్కలపల్లి, బెండల్‌పహాడ్‌,బాగిగూడెం, పల్లెపహాడ్‌ గ్రామా ల సర్పంచులు, ఎంపీటీసీలు సభావేదిక వద్ద బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శించారు. సభ్యుల మద్దతుతో అమ్మనబోలును మండలంగా మార్చాలని ఏకవాక్య తీ ర్మానం చేశారు. గుంతలతో అధ్వానంగా మారిన నార్కట్‌పల్లి పట్టణంలోని మె యినరోడ్డుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సభ్యులు కోరారు. ప్రభుత్వ భూముల కబ్జా, కృష్ణా వాటర్‌తో పాటు పలు సమస్యలపై సమావేశం లో చర్చించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీడీవో యాదగిరి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T06:23:01+05:30 IST