రాహుల్‌ గాంధీకి ఝలక్... పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్లు

ABN , First Publish Date - 2021-03-04T21:05:13+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గట్టి ఝలక్ తగిలింది. సొంత నియోజకవర్గమైన వాయనాడ్‌కు చెందిన నలుగురు సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు

రాహుల్‌ గాంధీకి ఝలక్... పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్లు

తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గట్టి ఝలక్ తగిలింది. సొంత నియోజకవర్గమైన వాయనాడ్‌కు చెందిన నలుగురు సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కేకే విశ్వనాథన్, ఎం.ఎస్. విశ్వనాథన్, పీకే అనిల్ కుమార్, సుజయ వేణుగోపాల్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాపై ఎం.ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ... ‘‘పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పీసీసీ పట్టించుకోవడం లేదు. డీసీసీ పట్టించుకోవడం లేదు. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.’’ అని విశ్వనాథన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-04T21:05:13+05:30 IST