Americaలో అదరగొట్టిన 15ఏళ్ల తెలుగు అమ్మాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..

ABN , First Publish Date - 2021-11-12T01:26:07+05:30 IST

భారత్‌కు చెందిన 15ఏళ్ల అమ్మాయి.. రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2021ఏడాదికి గాను చిల్డ్రన్ క్లైమేట్ ప్రైజ్‌ను కొల్లగొట్టింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచానికి కార్చిర్చు పెద్ద స

Americaలో అదరగొట్టిన 15ఏళ్ల తెలుగు అమ్మాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన 15ఏళ్ల అమ్మాయి.. రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2021ఏడాదికి గాను చిల్డ్రన్ క్లైమేట్ ప్రైజ్‌ను కొల్లగొట్టింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచానికి కార్చిర్చు పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల లక్షలాది ఎకరాల్లో అడవులు కాలి బూదిదవుతున్నాయి. అందులో నివసిస్తున్న జంతువులు కూడా మంటలకు మాడిపోతున్నాయి. అయితే వాటిని ఆర్పేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో పర్యావరణ వేత్తలు కార్చిచ్చుపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు వల్ల మానవాళి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. 



ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడ్డ 15ఏళ్ల తెలుగు అమ్మాయి.. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కార్చిచ్చును ముందుగానే అంచానా వేయొచ్చంటూ 15ఏళ్ల రేష్మా ఓ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. అంతేకాకుండా 90శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ముందుగానే అంచనా వేయొచ్చని నిరూపించింది. ఈ క్రమంలోనే రేష్మా రూపొందించిన ప్రాజెక్ట్‌‌కు.. 2021 సంవత్సరానికి ఉత్తమ చిల్డ్రన్ క్లైమేట్ ఫ్రైజ్ దక్కింది. ఈ క్రమంలో స్పందించిన రేష్మా.. తాను రూపొందించిన ప్రాజెక్ట్‌కు ఫ్రైజ్ రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. 




Updated Date - 2021-11-12T01:26:07+05:30 IST