గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలి

ABN , First Publish Date - 2022-08-09T05:06:19+05:30 IST

గిరిజనుల రిజర్వేషన్‌ శాతం పెంచాలని సోమవారం

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలి
జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతి పత్రం సమర్పిస్తున్న గిరిజనులు

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 8 : గిరిజనుల రిజర్వేషన్‌ శాతం పెంచాలని సోమవారం బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో గిరిజనులు జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతిపత్రం సమర్పించారు. గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ శాతం పెంచాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 10శాతం గిరిజన రిజర్వేషన్‌ హక్కును రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని, లేకుంటే ఎస్టీ మోర్చా ఆద్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి హెచ్చరించారు. 



Updated Date - 2022-08-09T05:06:19+05:30 IST