‘గాల్లోంచి నీటిని వేరు చేస్తుంది.. ఎటువంటి శక్తి అవసరం లేకుండానే..’

ABN , First Publish Date - 2021-01-24T02:17:12+05:30 IST

గాల్లోంచి నీరు వేరు చేసేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ సరికొత్త రసాయనిక మిశ్రమాన్ని రూపొందించారు.

‘గాల్లోంచి నీటిని వేరు చేస్తుంది.. ఎటువంటి శక్తి అవసరం లేకుండానే..’

ఇంటర్నెట్ డెస్క్: గాల్లోంచి నీరు వేరు చేసేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ సరికొత్త రసాయనిక మిశ్రమాన్ని రూపొందించారు. వెలుపలి నుంచి ఎటవంటి శక్తిని అందించాల్సిన అవసరం లేకుండా.. ఈ మిశ్రమం గాల్లోంచి తేమను పీల్చి నీళ్లగా మార్చి బయటకు విడుదల చేస్తుందని నేషనల్ యూనివర్శిటీ  ఆఫ్ సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు రూపొందించిన ఈ ఎయిరోజెల్ గంటకు 17 లీటర్ల నీటిని వేరు చేయగలదు. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ ఎయిరోజెల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని 95 శాతం ఆవిరిని నిటీగా మారుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అణుగుణంగా దీన్ని రూపొందించారు. గాల్లోకి తేమ నిరంతరంగా చేరుతున్న కారణంగా ఈ ఎయిర్‌జెల్ ద్వారా కావాల్సిన సమయంలో నీరు పొందవచ్చని చెప్పారు.

Updated Date - 2021-01-24T02:17:12+05:30 IST