రెస్కోను కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-04T10:55:16+05:30 IST

కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) విలీన ప్రయత్నాలను వెంటనే ఆపాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

రెస్కోను కొనసాగించాలి

 టీడీపీ డిమాండ్‌


కుప్పం, ఆగస్టు 3: కుప్పం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) విలీన ప్రయత్నాలను వెంటనే ఆపాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. రెస్కో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం చేయవద్దని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. రెస్కో వ్యవహారాల వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, నాయకులు ఏవీ రవి, కేఎస్‌ సుబ్రహ్మణ్యం, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T10:55:16+05:30 IST