సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి
ABN , First Publish Date - 2020-10-21T05:47:35+05:30 IST
రెడ్డి జేఏసీ రాష్ట్రశాఖ ఆదేశాల మేర కు మంగళవారం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో పరి పాలనా అధికారి కె. సురేష్కు వినతిపత్రాన్ని అందజేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 20: రెడ్డి జేఏసీ రాష్ట్రశాఖ ఆదేశాల మేర కు మంగళవారం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో పరి పాలనా అధికారి కె. సురేష్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి పరివార్ అధ్యక్షుడు వి.మధుసూదన్రెడ్డి, కార్యదర్శి రాధారెడ్డిలు మాట్లా డుతూ అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేద ని, సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్, అగ్రవర్ణ పేదలకు ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపా రన్నారు. హామీలను అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశా మన్నారు. రెడ్డి పరివార్ కార్యవర్గ సభ్యుడు మన్మథరెడ్డి, సత్యపాల్రెడ్డి, సత్య నారాయణరెడ్డి, సత్తిరెడ్డి, రమేష్రెడ్డి, శ్రీరాంపూర్ అధ్యక్షుడు వి. రాంరెడ్డి, కార్యవర్గ సభ్యుడు వెంకట్ రెడ్డి, మణిమాల, పద్మ, రేణుక పాల్గొన్నారు.