ప్రాంతీయ ఆస్పత్రిలో సమస్యలపై వినతి

ABN , First Publish Date - 2021-07-27T06:07:42+05:30 IST

ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర మహా సంపర్క్‌ ప్రముఖ్‌ గాదె శ్రీనివాసరావు అన్నారు.

ప్రాంతీయ ఆస్పత్రిలో సమస్యలపై వినతి
మెడికల్‌ సూపరింటెండెంట్‌ డేవిడ్‌తో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు

 

నర్సీపట్నం, జూలై 26 : ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర మహా సంపర్క్‌ ప్రముఖ్‌ గాదె శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ను కలిసి, ఆస్పత్రిలో డాక్టర్లు విధులకు ఆలస్యంగా వస్తున్న విషయాన్ని వివరించారు. ఓపీ సమయంలో వైద్యులు లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆస్పత్రిలో  వైద్యులు, సిబ్బంది పోస్టులు 56 ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్ల పృద్విరాజ్‌, జగన్నాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:07:42+05:30 IST