గుడ్న్యూస్.. కీలక ప్రకటన చేసిన ఫ్లిప్కార్ట్, అమెజాన్
ABN , First Publish Date - 2021-01-15T01:00:54+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు రిపబ్లిక్ డే సేల్కు శ్రీకారం చుట్టాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు రిపబ్లిక్ డే సేల్కు శ్రీకారం చుట్టాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను ప్రకటించింది. జనవరి 20 నుంచి 23 వరకూ ఈ సేల్ జరుగుతుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్లో భాగంగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ సభ్యులకు జనవరి 19 నుంచే సేల్ మొదలవుతుందని తెలిపింది. స్మార్ట్ఫోన్లపై గతంలో ఎన్నడూ లేనంత డిస్కౌంట్ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతేకాదు, ప్రైమ్ సభ్యులకు 20 నుంచి 22వ తేదీల్లో రాత్రి 8 గంటలకు భారీ డిస్కౌంట్ను ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇక మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. జనవరి 20 నుంచి 24 వరకూ ఈ సేల్ ఉంటుందని వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్పై 80 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. టీవీలపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.