గణతంత్ర వేడుకల రిహార్సల్స్‌ను పరిశీలించిన ఎస్పీ

ABN , First Publish Date - 2021-01-25T05:43:12+05:30 IST

జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో మంగళవారం జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా ఆదివారం పరేడ్‌ రిహార్సల్స్‌, కవాత్‌ను ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు.

గణతంత్ర వేడుకల రిహార్సల్స్‌ను పరిశీలించిన ఎస్పీ

కర్నూలు, జనవరి 24: జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో మంగళవారం జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా ఆదివారం పరేడ్‌ రిహార్సల్స్‌, కవాత్‌ను ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సివిల్‌, ఏఆర్‌, డాగ్‌ స్క్వాడ్‌, హోంగార్డ్స్‌, స్కౌట్‌ విద్యార్థులు చాలా చక్కటి టర్నవుట్‌తో పరేడ్‌ రిహార్సల్స్‌ చేశారన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు గానీ, వస్తువులు గానీ ఎక్కడైనా కనిపిస్తే డయల్‌ 100కు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ రాధాక్రిష్ణ, ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా, హోంగార్డు డీఎస్పీ వై.రవీంద్రారెడ్డి, ఆర్‌ఐలు సుధాకర్‌, సురేంద్ర రెడ్డి, వీఎస్‌ రమణ, నాగేశ్వరరావు, ఆర్‌ఎ్‌సఐలు, సివిల్‌, ఏఆర్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు, హోంగార్డులు, స్కౌట్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T05:43:12+05:30 IST