నేడు కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు
ABN , First Publish Date - 2022-01-26T06:58:07+05:30 IST
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 25 : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోను నిరాడంబరంగా నిర్వహించాలని సీఎస్ సోమేష్కు మార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిం చాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పతాకావిష్కరణ చేయాలని అదే సమయంలో జిల్లాలోని ఇతర శాఖల అధి కారులు తమ కార్యాలయాల్లో 10 గంటలకు పతాకావిష్కరణ చేయాలని ఆదే శించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో గణతంత్య్ర వేడుకల నిర్వ హణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని అధికారులకు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ గణతంత్య్ర దినోత్సవ నిర్వహణపై ఆదేశాలిచ్చారు.
కుభీర్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో గణతంత్య్ర దినోత్సవ ఏర్పా ట్లు జరిగాయి. కార్యాలయాలను శుభ్రపరిచి త్రివర్ణ కాగితాలను అతికించారు. జెండాస్తంభానికి రంగులు దిద్దారు. బుధవారం ఉదయం జరిగే గణతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆయా కార్యాలయాల్లో అధికారులు జెండాను ఆవి ష్కరించనున్నారు.