ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్థానికుల వినతి

ABN , First Publish Date - 2021-05-08T20:56:20+05:30 IST

ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కోవిడ్ పేషెంట్లకు బెడ్స్ ఆక్సిజన్ దొరకక ఇబ్బందులు పడుతున్నారని నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ నేత ఎం.మహేందర్ బాబు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే దానం  నాగేందర్ కు స్థానికుల వినతి

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కోవిడ్ పేషెంట్లకు బెడ్స్ ఆక్సిజన్ దొరకక ఇబ్బందులు పడుతున్నారని నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ నేత ఎం.మహేందర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వినతి పత్రాన్ని అందజేశఆరు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో కోవిడ్ పేషెంట్లకు హాస్పిటల్స్ లో బెడ్స్ ఆక్సిజన్, వెంటిలేటర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి పెద్ద మనసుతో నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న కోవిడ్ పేషెంట్లకు బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇప్పించగలరని వారు కొరారు. 


కొన్ని ఆస్పత్రుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా చార్జీలు వసూలు వేయకుండా వారి ఇష్టం వచ్చినట్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా వారు ఫిర్యాదు చేశారు. కావున దయచేసి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి నియోజకవర్గ ప్రజలకు బెడ్లు కేటాయించే విధంగా చూడగలరని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాగేందర్ హామీ ఇచ్చారు.  

Updated Date - 2021-05-08T20:56:20+05:30 IST