ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సిద్ధమైన విచారణ నివేదిక
ABN , First Publish Date - 2020-07-04T19:09:34+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను మరోసారి పరిశీలన నిమిత్తం సభ్యులకు పంపినట్టు తెలిసింది. ప్రమాదంపై గత నెల 30న ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. కమిటీ సభ్యులు ముసాయిదా నివేదిక పరిశీలించిన తరువాత తుది నివేదిక రూపొందిస్తారు. అయితే కర్మాగార యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా కమిటీ తేల్చింది. యాజమాన్యం, సంబంధిత అధికారులపై తీసుకోవలసి చర్యలతోపాటు బాధిత గ్రామాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నివేదికలో పొందుపరిచే అవకాశం వుందని తెలిసింది.