అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి నాగార్జున

ABN , First Publish Date - 2022-05-01T17:24:50+05:30 IST

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రి నాగార్జున

అత్యాచార  బాధితురాలిని పరామర్శించిన మంత్రి నాగార్జున

గుంటూరు: రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార  బాధితురాలిని మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. ఇటువంటి ఘటన బాధాకరమన్నారు. దుండగులతో భర్త పెనుగులాడి పోలీసుల వద్దకు పరుగెత్తాడని, ఈ సమయంలో ఆమెపై అత్యాచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి పట్టుకోమని చెప్పామన్నారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించి, నిందితులను పోలీసులు గుర్తించారన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే వారు ఉండేవారు కాదన్నారు. గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఏంచేయాలో అది చేస్తామన్నారు.


  

Updated Date - 2022-05-01T17:24:50+05:30 IST