రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళన

ABN , First Publish Date - 2022-05-01T17:38:47+05:30 IST

రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళన

రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళన

గుంటూరు: రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలిని పరామర్శకు పోలీసులు అనుమతించలేదు. ఆసుపత్రి గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


కాగా రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళాపై ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు ఆ కుటుంబం పనులు నిమిత్తం వెళ్తుంది. గత రాత్రి రైలు దిగి 1వ నెంబర్ ప్లాట్ ఫాంపై వారు నిద్రిస్తున్నారు. మహిళను ఫ్లాట్ ఫాం చివరకు ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-01T17:38:47+05:30 IST