వేదాద్రి-కంచల ఎత్తిపోతలను బాగు చేయండి

ABN , First Publish Date - 2021-08-19T16:51:16+05:30 IST

వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకానికి..

వేదాద్రి-కంచల ఎత్తిపోతలను బాగు చేయండి

మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌


జగ్గయ్యపేట రూరల్‌: వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసి రైతులకు తక్షణమే నీరు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. రైతులు, టీడీపీ నాయకులతో కలిసి బుధవారం ఆయన ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిరాటంకంగా సాగిన ఎత్తిపోతల పథకం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూలనపడిందన్నారు. నిధులు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర తెలుగు విభాగం అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించకపోవటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షురాలు రామలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా నరసింహారావు, నాయకులు వడ్లమూడి రాంబాబు, ధూళిపాళ్ల లక్ష్మణరావు, అడుసుమల్లి ప్రభాకరరావు, పసుమర్తి యాదగిరి, రాంబాబు, బాబూరావు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-19T16:51:16+05:30 IST